భారత్ వేదికగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా( India vs Australia ) మధ్య ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ లో భాగంగా నేడు వైజాగ్ వేదికగా( Vishakapatnam ) తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా పై గెలిచి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని గట్టి పట్టుదలతో బరిలోకి దిగనుంది.
వన్డే వరల్డ్ కప్ లో( World Cup ) భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ ఓటమిని క్రికెట్ ప్రేక్షకులతో పాటు భారతీయులంతా జీర్ణించుకోలేకపోతున్నారు.ఇప్పటికీ క్రికెట్ ప్రేక్షకులు ఫైనల్ మ్యాచ్ మర్చిపోలేదు.
ఎవరు ఊహించని రీతిలో ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ కు గట్టి దెబ్బ తగిలింది.
ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్లో దెబ్బ కొట్టిన ఆస్ట్రేలియాను కనీసం టీ20 సిరీస్ లో( T20 Series ) ఓడించి ద్వైపాక్షిక సిరీస్ కైవసం చేసుకుని ఎదురు దెబ్బ కొట్టాలని భారత జట్టు భావిస్తోంది.ఆసీస్ తో టీ20 మ్యాచ్ ఆడే భారత జట్టులో దాదాపుగా అందరూ యువ ఆటగాళ్లే.సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి అంత యువ ఆటగాలనే సెలెక్టర్లు టీ20 సీరీస్ ఆడే జట్టుకు ఎంపిక చేశారు.
సూర్య కుమార్ యాదవ్( Surya Kumar Yadav ) సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగనుంది.
రుతురాజ్ గైక్వాడ్( Ruturaj Gaikwad ) ఈ టీ20 సీరీస్ ఆడే భారత జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.కొత్త ప్లేయర్లు భారత జట్టులో చోటు సంపాదించుకున్నారు.ఈ సిరీస్ లో రాణిస్తే.
భవిష్యత్తులో ఈ ఆటగాళ్లకు భారత జట్టులో శాశ్వతంగా చోటు దక్కే అవకాశం ఉంది.ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దు అయ్యే అవకాశం మాత్రం లేదని, కాకపోతే వర్షం కారణంగా టాస్ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.