కొడంగల్ నియోజకవర్గంలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ మేరకు బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు ఆయన హాజరయ్యారు.
ఓటు ఐదేళ్ల భవిష్యత్ ను నిర్ణయిస్తుందన్న కేసీఆర్ ప్రజలు అభ్యర్థితో పాటు పార్టీల చరిత్ర చూసి ఓటు వేయాలని సూచించారు.యాభై ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో గమనించాలన్నారు.
కాంగ్రెస్ హయాంలో తాగునీరు కూడా ఇవ్వలేదన్న ఆయన ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు.బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసమని తెలిపారు.24 గంటల కరెంట్, రైతుబంధు వంటి పథకాలు కావాలంటే బీఆర్ఎస్ కే పట్టం కట్టాలని కోరారు.