బీఆర్ఎస్ పాలనకు అంతం పలికే రోజు వచ్చింది..: రాహుల్ గాంధీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పినపాకలో రోడ్ షో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ, కేసీఆర్ ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

 The Day Has Come To End The Rule Of Brs..: Rahul Gandhi-TeluguStop.com

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలతో పాటు మ్యానిఫెస్టోను అమలు చేస్తామని రాహుల్ గాంధీ తెలిపారు.పదేళ్లుగా తెలంగాణను దోచుకున్నారని ఆరోపించిన ఆయన రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనకు అంతం పలికే రోజు వచ్చిందని చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉందో తాను స్వయంగా వెళ్లి చూశానన్నారు.ఈ ప్రాజెక్టుతో రూ.లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.ధరణి పేరుతో భూములు లాక్కున్నారన్న రాహుల్ గాంధీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతిని ప్రజలు అర్థం చేసుకున్నారని తెలిపారు.

ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ నెరవేరుస్తుందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube