ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు.కేంద్ర నిధులతోనే ఏపీలో అభివృద్ధి జరుగుతోందని తెలిపారు.
రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు లేవన్న పురంధేశ్వరి రోడ్లు కూడా అధ్వాన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు.కేంద్ర నిధులను సీఎం జగన్ దారి మళ్లించారని ఆరోపించారు.
రాజధాని అమరావతి పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆమె చెప్పారు.రాజధానికి భూములను ఇచ్చిన రైతులను సైతం మోసం చేశారని దుయ్యబట్టారు.
రాజధాని రైతులకు కనీసం కౌలు కూడా ఇవ్వడం లేదన్న పురంధేశ్వరి కేంద్ర నిధులు ఏమయ్యాయో జగన్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.