పోలీస్ స్టేషన్ కి చేరిన బీఆర్ఎస్ కుమ్ములాట...!

నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ అధికార పార్టీ నేతల మధ్య ఏర్పడిన అంతర్గత వర్గపోరు కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీ 7వ,వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ నిమ్మల ఇందిరా కుమారుడికి, మున్సిపల్ చైర్మన్ అనుషా రెడ్డి మామ, బీఆర్ఎస్ రాష్ట్ర నేత కర్ణ బ్రహ్మానందరెడ్డి మధ్య గత ఆదివారం జరిగిన బూత్ కమిటీ సమావేశంలో మాటా మాటా పెరగడంతో ఘర్షణకు దారితీసిన సంగతి తెలిసిందే.

 Brs Group Politics In Nandikonda Municipality, Brs Group Politics ,nandikonda Mu-TeluguStop.com

ఇరువురి మధ్య గత కొంత కాలంగా కొనసాతున్న మాటల యుద్ధం కాస్త కౌన్సిలర్ నిమ్మల ఇందిరా కారుపై బ్రహ్మానందరెడ్డి అనుచరులు దాడి చేయడంతో కారు అద్దాలు ధ్వంసం కావడంతో గులాబీ నేతల మధ్య అంతర్గత గొడవలు కాస్త ఎన్నికల సమయంలో బహిర్గతమయ్యాయి.ఇరు వర్గాలవారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మంగళవారం ఇరువర్గాలపై కేసు నమోదు చేసి,దర్యాప్తు చేస్తున్నామని నాగార్జునసాగర్ ఎస్ఐ సంపత్ గౌడ్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube