మనలో చాలామందిని ఫెయిల్యూర్ ఎంతో బాధపెడుతోంది.కొంతమంది ఫెయిల్యూర్ ను పాజిటివ్ గా తీసుకుంటే మరి కొందరు ఫెయిల్యూర్ ను నెగిటివ్ గా తీసుకుంటారు.కసి, పట్టుదలతో ఎంతో కష్టపడి షేక్ అయేషా సక్సెస్ సాధించారు.గ్రూప్1 విజేత, డిప్యూటీ కలెక్టర్ అయేషా ( Deputy Collector Ayesha )తన ప్రతిభతో ప్రశంసలు అందుకున్నారు.ఓటమి నుంచి వచ్చిన కసితో చదివిన షేక్ అయేషా స్వస్థలం మదనపల్లె కాగా అయేషా పేద కుటుంబంలో జన్మించారు.
షేక్ అయేషాకు( Sheikh Ayesha ) తన సినీ కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు ఎదురయ్యాయి.
ఎదురయ్యాయి.ఆత్మ విశ్వాసాన్ని ఆయుధంగా మలుచుకున్న అయేషా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమ్మ గృహిణి అని నాన్న చిరు వ్యాపారి అని తెలిపారు.
నా సక్సెస్ కు నా తల్లీదండ్రులే కారణమని ఆమె చెప్పుకొచ్చారు.ఏ సమయంలో అయినా నేను ఒత్తిడికి గురైతే నన్ను వెన్నుతట్టి నాలో ఆత్మస్థైర్యాన్ని కల్పించేవారని షేక్ అయేషా అన్నారు.

గ్రూప్స్ ప్రిపరేషన్ సమయంలో పేరెంట్స్ ఎంతగానో సపోర్ట్ అందించారని షేక్ అయేషా కామెంట్లు చేశారు.ఇంటర్ లో 982 మార్కులు వచ్చాయని షేక్ అయేషా చెప్పుకొచ్చారు.తమిళనాడు తంజావూరులోని శస్త్ర యూనివర్సిటీలో ( Shastra University, Thanjavur )బీటెక్ చదివానని ఆమె కామెంట్లు చేశారు.2018 సంవత్సరంలో నా బీటెక్ పూర్తైందని అయేషా అన్నారు.తాను టీసీఎస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఎంపికయ్యానని ఆమె చెప్పుకొచ్చారు.

ఐఏఎస్ కావాలనేది నా లక్ష్యమని అందుకోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అయేషా పేర్కొన్నారు.మహిళలను విద్యావంతులను చేయడంతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించడం నా లక్ష్యమని షేక్ అయేషా అన్నారు.షేక్ అయేషా చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.
అయేషా కెరీర్ పరంగా రాబోయే రోజుల్లో మరిన్ని సక్సెస్ లను అందుకుంటారేమో చూడాల్సి ఉంది.








