టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో చంద్రబాబు తరపు లాయర్లు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ కేసులో చంద్రబాబును ఇవాళ్టి వరకు అరెస్ట్ చేయొద్దని, గతంలో ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ దశలో ఉన్న పీటీ వారెంట్ ఈరోజు వరకు స్టే ఇచ్చింది.
ఈ క్రమంలో ఉత్తర్వులు ముగియనుండటంతో ఇవాళ మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు ఏ1 గా పేర్కొన్న సంగతి తెలిసిందే.







