వివాహిత దారుణ హత్య.. అనుమానమే భర్తతో హత్య చేయించిందా..?

పశ్చిమగోదావరి జిల్లా ( West Godavari )పెనుగొండ శివారులో ఉండే పంట పొలల్లో హత్యకు గురైన ఓ వివాహిత మృతదేహం కనిపించి గ్రామంలో తీవ్ర కలకలం రేపింది.మంగళవారం ఉదయం మృతదేహం కనిపించడంతో రైతులు పోలీసులకు సమాచారం అందించారు.

అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

మంగళవారం ఉదయం పెనుగొండ( Penugonda ) శివారు అడ్డపుంతలో గుత్తుల చిన్న నారాయణ అనే కౌలు రైతు పంట పొలంలోని బోదేలలో బోర్ల పడి ఉన్న ఓ మహిళ మృతదేహంను రైతులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

డీఎస్పీ కె.రవి మనోహరాచారి, సీఐ జీవీవీ నాగేశ్వరరావు, ఎస్ఐ ఎన్వీవీ రమేష్ సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు.మృతదేహం వీపు పైనా, ఎడమ భుజం పైనా, చాతి పైనా పదునైన ఆయుధంతో పొడిచిన గాయాలు ఉన్నాయి.

ఆ మహిళ వయసు ఓ 25 ఏళ్లు ఉండవచ్చు.వీఆర్వో ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్తుతెలియని మహిళ మృతదేహంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.

మంగళవారం సాయంత్రానికే మృతురాలు చివటం నందినిగా గుర్తించి, ఆమె భర్త చివటం రాంప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.దొంగరవిపాలెం కు చెందిన పితాని నందిని( Nandhini )ను చివటం రాంప్రసాద్ 2019లో ప్రేమ వివాహం చేసుకున్నాడు.

వీరికి 18 నెలల కుమారుడు ఉన్నాడు.

ఈ హత్య విషయం బయటకు రావడంతో భార్యపై అనుమానంతో భర్తే హత్య చేసి ఉంటాడని స్థానికుల అభిప్రాయం.కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే హత్యకు గల కారణాలు ఏమిటో.హత్య ఎవరు చేసారో అనే వివరాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube