రాజన్న సిరిసిల్ల జిల్లా : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల (అక్టోబర్ 21-31 వరకు)లో భాగంగా 17వ పోలీస్ బెటాలియన్ సర్దాపూర్ నందు కమాండంట్ యస్.శ్రీనివాస రావు ఆదేశాల మేరకు ఈ రోజు పోలీస్ అధికారులు, సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది.
ఇందులో భాగంగా ఏ.ఆర్.యస్.ఐ, క్రింది స్థాయి ర్యాంకు పోలీసు అధికారులకు ” వర్క్- లైఫ్ బాలన్స్ ఇన్ పోలీస్ ” అనే అంశం పై మరియు ఆర్.యస్.ఐ/ యస్.ఐ పైస్థాయి ర్యాంకు పోలీసు అధికారులకు “రోల్ అఫ్ పోలీస్ ఇన్ మైంటైనింగ్ జెండర్ ఈక్వలిటీ ఇన్ సొసైటీ ” అనే అంశం పై పోలీస్ సిబ్బందికి వ్యాస రచన పోటీలను నిర్వహించారు.వ్యాస రచన పోటీలలో పాల్గొని మొదటి మూడు స్థానాలలో నిలిచిన వారికి బహుమతులు అందజేయటం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ లు ఎ.జయప్రకాష్ నారాయణ , పార్థసారథి రెడ్డి ,అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.







