టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలోని ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి లేఖ రాశారు.ఈ మేరకు జైలు అధికారుల ద్వారా ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ పంపారని తెలుస్తోంది.
చంద్రబాబు తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలతో పాటు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.ఈనెల 25వ తేదీన ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి చంద్రబాబు మూడు పేజీల లేఖ రాశారు.
అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.