బీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు హాస్యాస్పదమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.ధరణిని రద్దు చేస్తే మళ్లీ పటేల్, పట్వారి వ్యవస్థ వస్తుందనడం సరికాదని తెలిపారు.
అసలు ధరణి పోర్టల్ తోనే సమస్యలు అన్నీ పుట్టుకొచ్చాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు.ధరణి సమస్యలతో లక్షల్లో దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.తొలగించిన 30 వేల మంది వీఆర్వో, వీఆర్ఏలకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తామన్నారు.
ఎమ్మెల్సీ కవిత కొనుగోలు చేసిన భూమికే పట్టాదారు పాసు పుస్తకం రాలేదని విమర్శించారు.ధరణి అంశంపైనే ఈ ఎన్నికల్లో కొట్లాటకు సిద్ధమా అని ప్రశ్నించారు.