తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది.ఈ మేరకు మధ్యాహ్నం తరువాత కిషన్ రెడ్డి హస్తినకు పయనం కానున్నారు.
అయితే తెలంగాణలో జనసేన పార్టీతో పొత్తు అంశంపై కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నట్లు సమాచారం.వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేయాలా.? మద్దతు తీసుకోవాలా అన్నదానిపై చర్చించేందుకు గానూ పార్టీ అధిష్టానం కిషన్ రెడ్డిని ఢిల్లీకి ఆహ్వానించిందని తెలుస్తోంది.ఈ క్రమంలో పార్టీ హైకమాండ్ తో సమావేశం తరువాత తెలంగాణలో బీజేపీ -జనసేన పొత్తు అంశం తేలనుంది.
కాగా ఇప్పటికే రాష్ట్రంలో మొత్తం 32 స్థానాల్లో పోటీ చేసే జాబితాను జనసేన ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే వీటిలో ఆరు నుంచి పది స్థానాలు ఇచ్చే ఆలోచనలో కమలనాథులు ఉండగా కనీసం ఇరవై స్థానాలైనా ఇవ్వాలని జనసేన పట్టుబడుతుంది.







