ఏపీ టీడీపీ జోనల్ కోఆర్డినేటర్లతో ఆ పార్టీ నేత నారా లోకేశ్ భేటీ అయ్యారు.ఈ మేరకు ఉండవల్లి నివాసంలో సమావేశమైన లోకేశ్ జోన్ల వారీగా పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.
నవంబర్ ఒకటోతేదీ నుంచి బాబు షూరిటీ – భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఈ కార్యక్రమంపై చర్చించిన లోకేశ్ జనసేన కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని కోఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేశారు.
అదేవిధంగా వైసీపీ చర్యలను తిప్పి కొట్టాలని సూచించారు.







