కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో అమానుషం

కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో అమానుష ఘటన చోటు చేసుకుంది.దొంగతనం చేసిందని ఆరోపిస్తూ ఇళ్లల్లో పని చేసుకుని జీవనం సాగించే ఓ గిరిజన యువతిపై యజమాని దాడికి పాల్పడ్డాడు.

 Inhumanity In Mopidevi Mandal Of Krishna District-TeluguStop.com

ఈ దారుణ ఘటన కే.కొత్తపాలెం గ్రామంలో జరిగింది.బాధితురాలి బంధువులైన మరో ఇద్దరిని ఇంటికి పిలిపించి వారిపై కూడా దొంగతనం నేరాన్ని మోపేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే రెండు రోజుల పాటు వారిని ఇంటిలోనే నిర్బంధించి దాడి చేసినట్లు బాధితురాలు వాపోయింది.

యాజమాని దాడిలో తీవ్రగాయాలపాలైన బాధితురాలు మోపిదేవి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.అయితే తమ గోడును పట్టించుకోని మోపిదేవి ఎస్ఐ తిరిగి తమపైనే దాడి చేసినట్లు ఆరోపించారు.

ప్రస్తుతం బాధితులు అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube