కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ నేత, మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే ఆడబిడ్డలకు రూ.2,500 ఇస్తామని తెలిపారు.
ఇళ్ల స్థలాలు లేని వారికి రూ.5 లక్షలతో ఇళ్లు కట్టిస్తామని పొంగులేటి పేర్కొన్నారు.మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయొచ్చని తెలిపారు.
అలాగే నిరుద్యోగులకు తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.రైతు రుణమాఫీ ఒకేసారి రెండు లక్షలు చేస్తామన్న పొంగులేటి తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్ సర్కార్ వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజలకు మంచి జరుగుతుందని తెలిపారు.