తెలంగాణలోని 4 నియోజకవర్గాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్

తెలంగాణలోని నాలుగు నియోజకవర్గాలపై బీజేపీ హైకమాండ్ దృష్టి సారించిందని తెలుస్తోంది.ఈ మేరకు సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్ తో పాటు కామారెడ్డి నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టింది.

 Bjp Special Focus On 4 Constituencies In Telangana-TeluguStop.com

అభ్యర్థుల ఖరారు నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు ఈ నాలుగు నియోజకవర్గాల్లో జాతీయ నేతలు మకాం వేయనున్నారని సమాచారం.ఇందులో భాగంగానే మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా పర్యటనలకు పార్టీ అధిష్టానం ప్లాన్ చేస్తుంది.

అయితే బీఆర్ఎస్ ముఖ్యనేతలు పోటీ చేస్తున్న నాలుగు నియోజకవర్గాలను టార్గెట్ గా పెట్టుకుంది.ఈ క్రమంలోనే కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలు, కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్ల, హరీశ్ రావు పోటీ చేస్తున్న సిద్దిపేటపై బీజేపీ జాతీయ నాయకత్వం గెలుపుదిశగా వ్యూహాలను రచిస్తోంది.

కాగా తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పటికే పలువురు జాతీయ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube