కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ.కోదండ రాం భేటీ అయ్యారు.
కరీంనగర్ లోని ఓ హోటల్ లో ఇరువురి నేతల సమావేశం జరిగింది.
అయితే తమ మధ్య తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాత్రమే చర్చ జరిగిందని ప్రొ.
కోదండరాం అన్నారు.సీట్లు, పొత్తులపై ఎటువంటి చర్చ జరగలేదని తెలిపారు.
తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగుతుందన్న ఆయన ప్రజాస్వామిక పాలన రావాలని రాహుల్ గాంధీతో చర్చించినట్లు తెలిపారు.దీనిపై రాహుల్ గాంధీ వ్యక్తులు మారడం కాదు, పాలన మారాలని అన్నారని ప్రొ.
కోదండరాం వెల్లడించారు.







