కెరటం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమయ్యారు నటి రకుల్ ప్రీత్ సింగ్ ( Rakul Preeth Singh ) .అయితే ఈ సినిమా ఏ మాత్రం సక్సెస్ అందుకోలేకపోయింది.
ఈ సినిమా తర్వాత ఈమె నటుడు సందీప్ కిషన్ తో కలిసి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ఎంతో మంచి విజయం అందుకోవడంతో తదుపరి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి .ఇలా సౌత్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగినటువంటి రకుల్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమెకు బాలీవుడ్ సినిమా అవకాశాలు కూడా వచ్చాయి అయితే బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ అక్కడ మంచి సక్సెస్ కావడంతో ప్రస్తుతం రకుల్ పూర్తిగా బాలీవుడ్ సినిమాలకు మాత్రమే పరిమితమయ్యారు.
ఇక ఈమె తెలుగులో ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ నాగచైతన్య వంటి హీరోలు అందరి సరసన నటించారు.ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సరసన నటించిన ఈమెకు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సరసన నటించే అవకాశం కూడా వచ్చి చేజారిపోయిందని వెల్లడించారు.
మరి ప్రభాస్ సరసన నటించే అవకాశం వచ్చిన సినిమా ఏంటి.ఈమె ఆ సినిమా నుంచి ఎందుకు తప్పుకున్నారనే విషయానికి వస్తే ప్రభాస్ హీరోగా కాజల్ అగర్వాల్ తాప్సి హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మిస్టర్ పర్ఫెక్ట్.ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.అయితే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్రలో నటించే అవకాశం ముందుగా రకుల్ ప్రీతిసింగ్ కి వచ్చిందట అయితే ఈ సినిమా షూటింగ్లో ఈమె నాలుగు రోజుల పాటు పాల్గొన్న తర్వాత ఈమెను తొలగించి నటి కాజల్ అగర్వాల్ తీసుకున్నారని ఈమె ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేయడంతో ఈ కామెంట్స్ కాస్త ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మరి ఈమెకు మిస్టర్ ఫర్ఫెక్ట్ ( Mr.Perfect )సినిమాలో అవకాశం కల్పించి ఎందుకు తొలగించారు అనే విషయానికి వస్తే సౌత్ సినిమాలపై ఏమాత్రం అవగాహన లేని ఈ సమయంలో తనకు ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట అయితే తనకు అప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ కూడా జరగడంతో కేవలం పది రోజులు మాత్రమే తన కాల్ షీట్స్ ఇస్తానని ఈమె చెప్పారట.దీంతో ఈ సినిమాకు కమిట్ అయినటువంటి ఈమె షూటింగ్ లొకేషన్లో కూడా ఎగ్జామ్స్ కంగారు తనని వెంటాడిందని తెలియజేశారు.
ఇక నాకు ఇది కొత్త సినిమా కావడంతో నిర్మాతలు కూడా ఇలా ప్రభాస్ లాంటి హీరో పక్కన కొత్త అమ్మాయిని హీరోయిన్గా అంటే ప్రేక్షకులు ఒప్పుకుంటారా అన్న సందేహం వారికి కలిగింది దీంతో నన్ను తొలగించి నా స్థానంలో కాజల్ అగర్వాల్ ను తీసుకున్నారని ఈ సందర్భంగా రకుల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.సినిమా షూటింగ్లో పాల్గొని నన్ను తప్పించడంతో నాకు ఇది ఒక షాక్ లాగే అనిపించింది.అయితే ఈ సినిమాలో ఒకటి మాత్రమే కాదు నాగచైతన్య సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఆటోనగర్ సూర్య సినిమాలో కూడా ముందుగా నాకే అవకాశం వచ్చింది.
ఈ సినిమాకి కూడా టెన్ డేస్ కాల్ షీట్స్ అనడంతో నన్ను తప్పించే సమంతను తీసుకున్నారని అప్పుడు నాకు ఇండస్ట్రీ పై అవగాహన లేకే ఇలాంటి సినిమాలను మిస్ చేసుకున్నాను అంటూ రకుల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.