టీడీపీ నేత నారా లోకేశ్ సన్నిహితుడు కిలారు రాజేశ్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కిలారు రాజేశ్ హైకోర్టును ఆశ్రయించారు.కాగా చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో కిలారు రాజేశ్ పేరును సీఐడీ అధికారులు ప్రస్తావించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే కిలారు రాజేశ్ పరారీలో ఉన్నాడని అధికారులు ఆరోపిస్తున్నారు.రాజేశ్ ను విచారిస్తే స్కాంకు సంబంధించి మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఇదే సమయంలో కిలారు రాజేశ్ తనను అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ వేశారని తెలుస్తోంది.