ఏపీలో టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీకి భయం ఎందుకని టీడీపీ నేత బుద్దా వెంకన్న ప్రశ్నించారు.తమ పార్టీ అధినేత చంద్రబాబును జైల్లో పెట్టి శునకానందం పొందుతున్నారని విమర్శించారు.
స్కిల్ డెవలప్ మెంట్ గురించి మాట్లాడే అర్హత సజ్జల రామకృష్ణా రెడ్డికి లేదని బుద్దా వెంకన్న అన్నారు.చంద్రబాబుపై దొంగ అని ముద్ర వేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
పెద్ద ఎన్టీఆర్ కు దత్త పుత్రుడిలా కొడాలి నాని మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు.వైసీపీకి ఓడిపోతామనే భయం పట్టుకుందన్న ఆయన రానున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.