రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలకు విముక్తి..: రేవంత్ రెడ్డి

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.సీఎం కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.

 Liberation For The People Of Telangana In Coming Days..: Revanth Reddy-TeluguStop.com

రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలకు విముక్తి లభిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు.కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రకటించిన తరువాత కేసీఆర్ ప్రజాక్షేత్రంలో లేరని చెప్పారు.

ఈ క్రమంలోనే ఇక నుంచి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయటకు రానవసరం లేదన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీల మీదే తొలి సంతకమని తెలిపారు.

అయితే కొందరు ఓట్లు చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.తెలంగాణలో బీజేపీకి ఏముందని ప్రధాని, అమిత్ షా, జేపీ నడ్డా వస్తున్నారన్న రేవంత్ రెడ్డి ప్రజలకు ఎవరేం చేశారో బీఆర్ఎస్ తో చర్చకు తాము సిద్ధమని సవాల్ చేశారు.

ఈ నేపథ్యంలోనే బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube