బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు కీలక వ్యాఖ్యలు చేశారు.బలహీన వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు.
ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ నేతలు చెప్తున్న మాటలను నమ్మవద్దని ఎంపీ నామా సూచించారు.తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు.
ఈ నెల 16వ తేదీన కేసీఆర్ బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల చేస్తారని వెల్లడించారు.అయితే ఈ మ్యానిఫెస్టోను చూస్తే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడతాయని పేర్కొన్నారు.
ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న కేసీఆర్ ను మూడో సారి కూడా ముఖ్యమంత్రిని చేయాలని తెలిపారు.