బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు ఇచ్చిందని తెలుస్తోంది.ఈ మేరకు ఈనెల 6వ తేదీన ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.
కాగా మహదేవ్ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేసు విచారణలో భాగంగా హీరో రణదీప్ కు ఈడీ అధికారులు సమన్లు ఇచ్చారని సమాచారం.అయితే ఈ కేసులో పలువురు బాలీవుడ్ నటీనటులు, గాయకులు ఈడీ స్కానర్ లో ఉన్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో యుఏఈలో జరిగిన మహదేవ్ యాప్ ప్రమోటర్ వివాహానికి, సక్సెస్ పార్టీకి ప్రముఖులు హాజరైన నేపథ్యంలో ఈడీ విచారణ జరుపుతోన్న సంగతి తెలిసిందే.