ప్రస్తుతానికి జనసేనతో మాత్రమే పొత్తు..: అచ్చెన్నాయుడు

ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.

 At Present Only Alliance With Janasena..: Achchennaidu-TeluguStop.com

రాష్ట్రంలో ఎన్నికలు వచ్చే వరకు తమ పార్టీ అధినేత చంద్రబాబును జైల్లోనే ఉంచాలని చూస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు.అందుకే హడావుడిగా సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తున్నారని తెలిపారు.

అదేవిధంగా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ శ్రేణులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఈనెల 9వ తేదీ వరకు కొనసాగుతాయని చెప్పారు.దాంతో పాటు జనసేన పార్టీతో సమన్వయం కోసం కమిటీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

ప్రస్తుతానికి జనసేనతో మాత్రమే పొత్తులో ఉన్నామన్న అచ్చెన్నాయుడు వామపక్షాలతో పొత్తు అంశం చంద్రబాబు నిర్ణయిస్తారని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube