ప్రస్తుతానికి జనసేనతో మాత్రమే పొత్తు..: అచ్చెన్నాయుడు

ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో ఎన్నికలు వచ్చే వరకు తమ పార్టీ అధినేత చంద్రబాబును జైల్లోనే ఉంచాలని చూస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు.

అందుకే హడావుడిగా సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తున్నారని తెలిపారు.అదేవిధంగా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ శ్రేణులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఈనెల 9వ తేదీ వరకు కొనసాగుతాయని చెప్పారు.

దాంతో పాటు జనసేన పార్టీతో సమన్వయం కోసం కమిటీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.ప్రస్తుతానికి జనసేనతో మాత్రమే పొత్తులో ఉన్నామన్న అచ్చెన్నాయుడు వామపక్షాలతో పొత్తు అంశం చంద్రబాబు నిర్ణయిస్తారని వెల్లడించారు.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)