తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు.తాను గవర్నర్ గా వచ్చే నాటికి రాష్ట్ర కేబినెట్ లో మహిళా మంత్రి లేరని తెలిపారు.
తాను వచ్చిన తరువాతనే మహిళా మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించామని గవర్నర్ తమిళిసై అన్నారు.ప్రొటోకాల్ ఇచ్చినా, ఇవ్వకున్నా పని చేసుకుంటూ పోవాలని పేర్కొన్నారు.
తన మీద రాళ్లు విసిరితే వాటితో భవంతులు కడతానని చెప్పారు.దాడి చేసి రక్తం చూస్తే ఆ రక్తాన్ని సిరాగా మార్చి తన చరిత్ర రాస్తానని వ్యాఖ్యానించారు.
గవర్నర్ కంటే ముందు తాను రాజకీయ నాయకురాలినని స్పష్టం చేశారు.







