జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Janasena Leader Pawan Kalyan ) 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేయగా ఆయనకు చేదు ఫలితాలు వచ్చాయి.టీడీపీ జనసేన పొత్తు( TDP Janasena Alliance ) నేపథ్యంలో 2024 ఎన్నికల్లో టీడీపీకే అనుకూల ఫలితాలు వస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాపు ఉద్యమ నేత దాసరి రాము ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ చాలా సందర్భాల్లో ఓట్లు చీలనివ్వనని చెప్పారని ఆయన తెలిపారు.

పవన్ ప్రకటన వల్ల వైసీపీ( YCP ) అధికారంలోకి రావడం కష్టం కావడంతో జగన్ చంద్రబాబుపై అరెస్ట్ ల పర్వం మొదలుపెట్టారని దాసరి రాము కామెంట్లు చేశారు.ఎవరి పార్టీ వాళ్లు అధికారంలోకి వస్తారని చెబుతారని దాసరి రాము అన్నారు.రెడ్లు, ముస్లింలు, ఎస్సీల సపోర్ట్ వైసీపీకి ఉందని దాసరి రాము అభిప్రాయం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ ఓడిపోతే ఆయన జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అన్నారు.
చంద్రబాబును రెండు మూడు నెలలు కట్టడి చేస్తే టీడీపీకి ఇబ్బంది అని దాసరి రాము( Dasari Ramu ) కామెంట్లు చేశారు.
ప్రజల్లో వ్యతిరేకత ఉండటం వల్లే జగన్ అభ్యర్థులను మారుస్తున్నారని దాసరి రాము అన్నారు.ప్రజలకు పని కంటే ఉపాధి ముఖ్యమని ఆయన తెలిపారు.
బీజేపీకి జనసేన కూడా అవసరం లేదని దాసరి రాము కామెంట్లు చేశారు.ప్రతిసారి పవన్ చంద్రబాబుకు ఫేవర్ గా వ్యవహరిస్తున్నారని వాస్తవం వేరు అని దాసరి రాము అన్నారు.

చంద్రబాబు( Chandrababu )తో పవన్ జాగ్రత్తగా ఉండాలని దాసరి రాము వెల్లడించారు.గతంలో టీడీపీతో కలిసి వెళ్లిన పార్టీలు అన్నీ నాశనమయ్యాయని ఆయన అన్నారు.పవన్ ను ఓడించడానికి, చంద్రబాబును ఓడించడానికి వైసీపీ వేర్వేరుగా 500 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చు చేయడానికి సిద్ధమైందని దాసరి రాము పేర్కొన్నారు.దాసరి రాము వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.







