సాధారణంగా పోలీస్ స్టేషన్లో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది.దొంగలు అటువైపుకి వెళ్లాలంటేనే భయపడతారు.
కానీ తాజాగా కొందరు దొంగలు ఏకంగా ఒక పోలీస్ స్టేషన్ కే కన్నం వేశారు.స్టేషన్లో పోలీసులు ఉండగానే ఈ దొంగతనం జరగడం తెలిసి అందరూ నోరెళ్లబెడుతున్నారు.
వివరాల్లోకి వెళితే, శుక్రవారం రాత్రి బీహార్లోని( Bihar ) ముజఫర్నగర్ పోలీస్ స్టేషన్లోకి దొంగలు చొరబడి మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు.స్టేషన్లోని ఓ చోట పోలీసులు బిజీబిజీగా ఉండి దొంగతనాన్ని గమనించలేదు.అదే అదునుగా భావించి ఐదు బాక్సులు, మద్యం బాటిళ్ల బ్యాగును దొంగలు ఎత్తుకెళ్లారు.
2016లో బీహార్ ప్రభుత్వం మద్యం అమ్మకాలు, వినియోగాన్ని బ్యాన్ చేసింది.అప్పటినుంచి పోలీసులు తరచుగా అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని( Liquor ) స్వాధీనం చేసుకుంటారు.చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా, ప్రజలు దానిపై జోకులు వేస్తున్నారు.
కొంతమంది పోలీసులు, నితీష్ కుమార్ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్నారు.
భారీ వర్షం కురుస్తున్న సమయంలో చోరీ జరిగిందని పోలీసులు చెబుతున్నారు.ఆ సమయంలో డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులు ఒకే చోట గుమిగూడారని ఒక అధికారి వెల్లడించారు.ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకున్న దొంగలు ( Thieves ) పోలీస్స్టేషన్ గోడను పగులగొట్టి స్టోర్రూమ్లోకి ప్రవేశించి ఐదు బాక్సులు, మద్యం బాటిళ్లను అపహరించారని పేర్కొన్నారు.
మరుసటి రోజు తెల్లవారుజాము వరకు చోరీ జరిగిన సంగతిని పోలీసు అధికారులు గుర్తించలేకపోయారు.
సొంత పోలీస్ స్టేషన్ నే రక్షించుకోలేని తాము ఇక ప్రజల ఇళ్లను ఏం కాపాడతాం అని ఈ కట్టిన తర్వాత ఒక సిగ్గుచేటుగా భావించారు.పోయిన మద్యం బాటిళ్లను గుర్తించడంతో వారు షాక్కు గురయ్యారు.కాగా స్థానికంగా అయి దొంగతనం కలకలం రేపింది.