ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారని టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు ఆరోపించారు.గట్టిగా మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారని మండిపడ్డారు.
తమ పార్టీ అధినేత చంద్రబాబుపై కేసులు ఎత్తివేసి క్షమాపణ చెబితే ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అవినీతిపై చర్చిద్దామని అచ్చెన్నాయుడు తెలిపారు.ఇందులో భాగంగా చంద్రబాబును అసెంబ్లీకి తీసుకొచ్చి చర్చించడానికి తాము సిద్దంగా ఉన్నామని వెల్లడించారు.
అయితే ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలను టీడీపీ బహిష్కరించిందని నేతలు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే.







