ఉప్పల్ స్టేడియంలో వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ నిర్వహణపై గందరగోళం

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ నిర్వహణపై గందరగోళం నెలకొంది.ఈనెల 29వ తేదీన ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్, కివీస్ మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది.

 Confusion Over Conduct Of World Cup Warm-up Match At Uppal Stadium-TeluguStop.com

అయితే 28వ తేదీన గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగల దృష్ట్యా భద్రత ఇవ్వలేమని పోలీసులు చెబుతున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ప్రేక్షకులను అనుమతించకుండా మ్యాచ్ నిర్వహించేలా అధికారులు యోచిస్తున్నారని సమాచారం.

ఇదే విషయాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐకి వివరించింది.ఇంతవరకు బీసీసీఐ ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో హెచ్సీఏ బీసీసీఐ నిర్ణయం కోసం ఎదురు చూస్తుంది.

మరోవైపు పాక్ -కివీస్ వార్మప్ మ్యాచ్ టికట్ల అమ్మకాలు ఇప్పటికే పూర్తి అయ్యాయి.ఈ నేపథ్యంలో వార్మప్ మ్యాచ్ నిర్వహణ పై గందరగోళం నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube