ఒక్కోసారి చాలా నీరసంగా ఉంటుంది.బలహీనంగా మారిపోతుంటారు.
ఏ పని చేయలేకపోతుంటారు.అడుగు తీసి అడుగు వేయడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది.
అలాంటి సమయంలో చాలా త్వరగా రికవరీ అవడానికి ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ మిల్క్ చాలా అంటే చాలా అద్భుతంగా సహాయపడుతుంది.ఎంత బలహీనంగా ఉన్నా సరే ఈ మిల్క్ ను తీసుకుంటే వెయ్యి ఏనుగుల బలం మీ సొంతం అవుతుంది.
మరి ఇంతకీ ఆ మ్యాజికల్ మిల్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఐదు గింజ తొలగించిన ఖర్జూరాలు, ( Dates )పది వాటర్ తో కడిగిన బాదం పప్పులు( Almonds ) ఐదు జీడిపప్పులు వేసుకోవాలి.
అలాగే ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకుని గంట పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న పదార్థాలను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఆపై మరొక కప్పు పాలు మరియు పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి( Cardamom ) వేసి మరోసారి బ్లెండ్ చేసుకోవాలి.అంతే మన మ్యాజికల్ మిల్క్ సిద్ధం అయినట్టే.చివరిగా ఈ మిల్క్ లో వన్ టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న సబ్జా గింజలను కలిపి సేవించాలి.బలహీనంగా ఉన్నప్పుడు, నీరసంగా అనిపిస్తున్నప్పుడు ఒక గ్లాసు ఈ మ్యాజికల్ మిల్క్ ను తాగారు అంటే వెంటనే శక్తి వస్తుంది.
ఫుల్ ఎనర్జిటిక్ గా మారతారు.
ఎలాంటి నీరసం, ( Weakness )అలసట అయినా ఎగిరిపోతుంది.ఈ మ్యాజికల్ మిల్క్ ను డైలీ డైట్ లో కూడా చేర్చుకోవచ్చు.ఆరోగ్యపరంగా ఈ మిల్క్ ఎన్నో లాభాలను అందిస్తుంది.
రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది.బ్రెయిన్ ను షార్ప్ గా మారుస్తుంది.
అల్జీమర్స్ వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.చర్మాన్ని కాంతివంతంగా మెరిపిస్తుంది.
హెయిర్ ఫాల్ కు సైతం అడ్డుకట్ట వేస్తుంది.కాబట్టి బలహీనంగా ఉన్న వారే కాదు ఎవ్వరైనా ఈ మిల్క్ ను తీసుకోవచ్చు.