మండల ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మోడీకి క్షీరాభిషేకం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్థానిక పాత బస్టాండులో శనివారం మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు బొమ్మడి స్వామి ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.ఈ సందర్భంగా బొమ్మిడి స్వామి మాట్లాడుతూ చేతి వృత్తుదారులను ప్రోత్సహించడంలో భాగంగా 13 వేల కోట్ల బడ్జెట్ తో 18 కులాల జాతి వారికి ఉపాధి కల్పించేందుకు ఈ పథకాన్ని రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు.

 Abhisekam For Pm Modi Portrait By Ellareddy Peta Mandal Obc Morcha, Abhisekam ,p-TeluguStop.com

ఈ పథకంలో శిక్షణ పొందుతున్నటువంటి వారికి 500 చొప్పున ఇవ్వడం జరుగుతుందని

అదేవిధంగా 15 వేలు విలువచేసే పనిముట్లను సైతం ఇస్తున్నారని తెలిపారు.ఓబీసీలు ఆర్థికంగా ఎదుగుదలకు మోడీ కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంచర్ల పరుశరాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు బంధారపు లక్ష్మారెడ్డి, నాయకులు నేవూరి దేవేందర్ రెడ్డి, ఓ బి సి మండల ఉపాధ్యక్షులు సాగ లక్ష్మణ్, మిర్యాల కార్ రవి, సిరిపురం సుధీర్,మండల ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి,పారిపెల్లి రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube