మండల ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మోడీకి క్షీరాభిషేకం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్థానిక పాత బస్టాండులో శనివారం మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు బొమ్మడి స్వామి ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా బొమ్మిడి స్వామి మాట్లాడుతూ చేతి వృత్తుదారులను ప్రోత్సహించడంలో భాగంగా 13 వేల కోట్ల బడ్జెట్ తో 18 కులాల జాతి వారికి ఉపాధి కల్పించేందుకు ఈ పథకాన్ని రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు.

ఈ పథకంలో శిక్షణ పొందుతున్నటువంటి వారికి 500 చొప్పున ఇవ్వడం జరుగుతుందని అదేవిధంగా 15 వేలు విలువచేసే పనిముట్లను సైతం ఇస్తున్నారని తెలిపారు.

ఓబీసీలు ఆర్థికంగా ఎదుగుదలకు మోడీ కృషి చేస్తున్నారని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంచర్ల పరుశరాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు బంధారపు లక్ష్మారెడ్డి, నాయకులు నేవూరి దేవేందర్ రెడ్డి, ఓ బి సి మండల ఉపాధ్యక్షులు సాగ లక్ష్మణ్, మిర్యాల కార్ రవి, సిరిపురం సుధీర్,మండల ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి,పారిపెల్లి రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లేడీ ప్యాసింజర్‌పై విరుచుకుపడ్డ ఆటో డ్రైవర్.. వీడియో వైరల్..