అమరావతి: నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.విజయనగరం మెడికల్ కాలేజ్ ప్రాంగణం నుంచి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు (విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల) వర్చువల్ ప్రారంభోత్సవం.ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రాంగణానికి చేరుకుంటారు,
అక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహావిష్కరణ, తర్వాత నూతన మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం, ల్యాబ్ల పరిశీలన, మిగిలిన 4 మెడికల్ కాలేజీల వర్చువల్ ప్రారంభోత్సవం, అనంతరం సీఎం ప్రసంగిస్తారు.కార్యక్రమం అనంతరం బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.