మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్ లోని మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా సినీ ఫైనాన్షియర్ వెంకట్ తో పాటు బాలాజీ, మురళీకి కస్టడీ విధించారు.

 Investigation In Madapur Drug Party Case Is In Full Swing-TeluguStop.com

కాగా ఇందులో సినీ ఫైనాన్షియర్ వెంకట్ మాదాపూర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహించిన సంగతి తెలిసిందే.విచారణలో భాగంగా సుమారు 18 మందికి డ్రగ్స్ సరఫరా చేసినట్లు వెంకట్ ఒప్పుకున్నారు.

అయితే తమ పేర్లు బయటికి రావడంతో వెంకట్ కస్టమర్లు అందరూ ఫోన్ లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారని పోలీసులు తెలిపారు.కస్టమర్లతో స్నాప్ చాట్ లో మాత్రమే చాట్ చేసినట్లు వెంకట్ పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే వెంకట్ అరెస్ట్ అయిన తరువాత కస్టమర్లు స్నాప్ చాట్ అకౌంట్ లను డిలీట్ చేశారని పోలీసులు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube