తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు( Karthik Subbaraj ) 2014లో తెరకెక్కించిన సినిమా జిగర్తండ.ఈ సినిమా అప్పట్లో విడుదల అయ్యి సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.అంతేకాకుండా ఈ సినిమాలో బాబీ సింహా నటనకు గాను ఉత్తమ సహాయం చలనచిత్ర అవార్డును కూడా అందుకున్నారు.ఈ సినిమాను హీరో వరుణ్ తేజ్ గద్దల కొండ గణేష్ పేరుతో రిమేక్ చేసిన విషయం తెలిసిందే.హిందీలో బచ్చన్ పాండే గా ఈ సినిమా రీమేక్ అయ్యింది.

ఇది ఇలా ఉంటే జిగర్ తండ డబుల్ ఎక్స్( Jigarthanda doublex teaser ) అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు కార్తీక్ సుబ్బరాజు.గతంలో విడుదలైన జిగర్తండ మాదిరి కాన్సెప్ట్తోనే వింటేజ్ యాక్షన్ డ్రామాను చూపించబోతున్నారు.కాగా ఈ మూవీలో రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య ప్రధాన పాత్రల్లో నటించారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసి చిత్ర యూనిట్కి అభినందనలు తెలియజేశారు.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం టీజర్ను అన్ని భాషల వారికి అర్థమయ్యేలా చిన్న చిన్న ఇంగ్లిష్ పదాలతో పూర్తిస్థాయి యాక్షన్తో రూపొందించారు.పాత్రలను పరిచయం చేయడం, సినిమా కాన్సెప్ట్ను చెప్పడమే ఈ టీజర్ ముఖ్యోద్దేశంలా కనిపిస్తోంది.

ఈ పాన్ ఇండియా టీజర్ను తెలుగులో మహేష్ బాబు( Mahesh babu ) విడుదల చేయగా, తమిళంలో ధనుష్, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేశారు.అన్ని భాషల్లో టీజర్కు మంచి స్పందన వస్తోంది.ఈ సినిమా దీపావళి పండుగ విడుదల కానుంది.ఈ సందర్భంగా హీరో మహేష్ బాబు ఈ సినిమా టీజర్ ను విడుదల చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
అంతేకాకుండా మూవీ మేకర్స్ కు బెస్ట్ విషెస్ కూడా తెలిపారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







