సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ”గుంటూరు కారం( Guntur Kaaram )”.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి.
సినిమా అనుకున్న సమయానికి పూర్తి అవుతుందా లేదా అని అనుమానాలు వచ్చాయి.కానీ వాటికీ మేకర్స్ చెక్ పెట్టారు.

షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయ్యి శరవేగంగా పూర్తి అవుతుంది.ఇక ఈ సినిమా రిలీజ్ కు ఇంత సమయం ఉన్న అప్పుడే బిజినెస్ భారీగా చేస్తున్నట్టు టాక్.ఎప్పటి నుండో ఈ సినిమా భారీ బిజినెస్ జరుగుతుందని వార్తలు వస్తూనే ఉన్నాయి.ఇక అప్పుడప్పుడు కొన్ని వార్తలు బయటకు వస్తూ ఈ సినిమాపై అంచనాలు మరిన్ని పెంచేస్తున్నాయి.

ఇది పాన్ ఇండియా కాకపోయినా ఈ సినిమా కోసం కూడా ఏకంగా 220 కోట్ల బడ్జెట్ పెట్టనున్నారట.అయితే ఈ బడ్జెట్ కు అనుగుణంగానే ప్రీ బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది.మహేష్, త్రివిక్రమ్ వల్ల ఈ సినిమాకు అదే రేంజ్ లో క్రేజ్ రాగ బిజినెస్ స్థాయి కూడా పెరిగింది.తాజాగా ఈ సినిమా ఆడియో రైట్స్ భారీ ధరకు ప్రముఖ మ్యూజికల్ సంస్థ ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది.
త్వరలోనే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేయనున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి( SreeLeela ) హీరోయిన్ లుగా నటిస్తుండగా జగపతి బాబు విలన్ గా కనిపిస్తున్నాడు.
ఇక హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.







