దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సమావేశాలు… సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జరగబోతున్నాయి.దీంతో మొత్తం జీ20 పేరు దేశ వ్యాప్తంగా ఇపుడు బాగా వినబడుతోంది.
ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, చైనా, ఆస్ట్రేలియా వంటి ప్రపంచ అగ్రనేతలతో పాటు 40కి పైగా దేశాధి నేతలు ఢిల్లీలో 2 రోజుల పాటు బస చేయనున్నారు.ఇక ఈ ఏడాది జీ20 సదస్సుకి “వసుధైక కుటుంబం” అనే థిమ్ను పెట్టడం జరిగింది.
సంస్కృత రచనల్లో చూసుకుంటే సూక్ష్మజీవులు నుంచి మనుషులు, జంతుజాలం అంతా కూడా ఈ పుడమిపై ఒకే కుటుంబంగా జీవిస్తూ భవిష్యత్తులో ముందుకు సాగుతాయనేది.వసుధైక కుటుంబం అర్థం అని అందరికీ తెలిసిందే.

అదేవిధంగా పర్యావరణ జీవనాన్ని అవలంభించాలని ఈ సదస్సు ద్వారా జీ20 దేశాలు( G20 countries ) ప్రపంచానికి పిలుపుని ఇవ్వడం జరిగింది.జీవితంతోనే శుద్ధ, పర్వావరణ హిత, సుస్థిర ప్రపంచాభివృద్ధి సాధ్యమనేది ఈ జీ20 కూటమి అనుకుంటోంది.వాస్తవానికి 19 దేశాలు.ఐరోపా( Europe ) సమాఖ్య కూటమే ఈ జీ20.ప్రపంచ వస్తువుల ఉత్పత్తిలో 85 శాతం, అలాగే వాణిజ్యంలో 75 శాతం, జనాభాలో మూడింట రెండొంతులు ఈ జీ20 దేశాల్లోనే వుండడం విశేషం.అయితే జీ20లో అంతర్గతంగా 5 సమూహాలు ఉన్నాయి.

ఇక ఒక్కో గ్రూప్ నుంచి ఒక దేశం జీ20 నాయకత్వం కోసం పోటీ పడొచ్చు.ప్రతీ ఏడాది రొటేషన్ విధానంలో ఒక గ్రూప్కు సారథ్యం వహించే అవకాశం ఇక్కడ కలదు.ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి.తమ గ్రూప్ తరఫున సారథ్యం వహించే అవకాశం వచ్చినప్పుడు.అందులో నుంచి ఎవకు అధ్యక్షత వహించేందుకు పోటీ పడాలనేది అంతర్గతంగా ఉన్నటువంటి ఆ దేశాలు చర్చలు చేసి తమ ఉమ్మడి నిర్ణయాన్ని ప్రకటించవలసి వుంటుంది.ఇలా తర్వాత జీ20కి సారథ్యం వహించేంది ఎవరో నిర్ణయం అవుతుంది.







