టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎంపీ నందిగం సురేశ్ విమర్శలు గుప్పించారు.చంద్రబాబుకు ఆయన భవిష్యత్ అర్థం అయినట్లుందన్నారు.
అందుకే ఐటీ నోటీసుపై సమాధానం చెప్పకుండా దొంగలా తిరుగుతున్నారని విమర్శించారు.
రూ.118 కోట్లే కాదు అమరావతిలో చంద్రబాబు వేల కోట్లు దోపిడీ చేశారని ఎంపీ నందిగం ఆరోపించారు.ఈ అంశంపై దత్తపుత్రుడు, సీపీఐ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.
చంద్రబాబు, లోకేశ్, పవన్ ఎవరి వాటాలు ఎంతో బయటపెట్టాలని పేర్కొన్నారు.చంద్రబాబు జైలుకు వెళ్తే నిజాలు బయటకు వస్తాయని తెలిపారు.
తమ వైపు నుంచి సీఐడీ విచారణ జరుగుతుందని వెల్లడించారు.







