డబ్బులు ఊరికే రావు అనే ఒక డైలాగ్ తో ఎంతో ఫేమస్ అయ్యారో లలిత జ్యువెలరీ ఎండి కిరణ్ కుమార్( Kiran Kumar ).నగల వ్యాపార సంస్థలతో ఎంతో మంచి విజయం సాధించినటువంటి కిరణ్ కుమార్ తన వ్యాపార రంగాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలని తన కోరిక అంటూ ఇప్పటికే ప్రతి ఒక్క నగరంలోనూ లలిత జ్యువెలరీ ( Lalitha Jewellery )షోరూం ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఇలా ప్రతి ఒక్క జిల్లాలోనూ లలిత జ్యువెలరీ షోరూమ్స్ ప్రారంభిస్తున్నారు.
కిరణ్ కుమార్ విషయానికి వస్తే ఈయన పెద్దగా చదువుకోలేదు చదువుకోకపోయినప్పటికీ కష్టం విలువ డబ్బు విలువ తెలిసిన వ్యక్తి కావడంతో తనకున్నటువంటి తెలివితేటలను ఉపయోగించి నగల వ్యాపారంలోకి అడుగు పెట్టారు.
ఇలా నగల వ్యాపారంలో దినదినాభివృద్ధి చెందినటువంటి కిరణ్ కుమార్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే 51 షో రూమ్లను ప్రారంభించి వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు.

ఇక దేశవ్యాప్తంగా కూడా తన నగల వ్యాపారాన్ని విస్తరింప చేయాలన్నది తన లక్ష్యం అంటూ ఈయన చెప్పుకొచ్చారు.ఇక ఈ వ్యాపారాన్ని ప్రమోట్ చేయడానికి ఈయన ఎటువంటి సెలబ్రిటీలను( Celebrities ) కూడా నియమించలేదు తానే స్వయంగా డబ్బులు ఊరికే రావు అనే ఒక డైలాగ్ తోనే తన నగల సమస్థలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.భగవంతుడి దయతో నగల వ్యాపారంలో ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి కిరణ్ కుమార్ తాజాగా తిరుమల వెంకటేశ్వర స్వామికి ఊహించని విధంగా బంగారం విరాళంగా ఇచ్చారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.స్వామివారి దర్శనం అనంతరం కిరణ్ కుమార్ మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.కడపకు చెందిన డాక్టర్ రాజారెడ్డి అనే ఒక డోనర్ స్వామివారికి బంగారు పుష్పాలను( GoldenFlowers )చేయించమని ఆర్డర్ ఇవ్వడంతో తాము ఎంతో ప్రత్యేకంగా ఈ 108 పుష్పాలను తయారు చేశామని వీటి విలువ సుమారు రెండు కోట్లకు పైగా ఉంటుందని ఈ సందర్భంగా కిరణ్ కుమార్ తెలియజేశారు.స్వామివారి అర్చనలో భాగంగా ఈ బంగారు పుష్పాలను ఎంతో అద్భుతంగా తయారు చేశామని వీటిని తయారు చేయడానికి ఆరు నెలల సమయం పట్టిందని తెలిపారు.
ఇక ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈయన మరోసారి తన ఫేమస్ డైలాగ్ డబ్బులు ఎవరికి ఊరికే రావు అనే డైలాగ్ చెప్పారు.ప్రస్తుతం ఇందుకున్ సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.







