భారతదేశంలో జమిలి ఎన్నికలు కొత్తేమి కాదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి అన్నారు.జమిలి ఎన్నికలు కొత్త విధానం అని ప్రధానమంత్రి మోదీ అనడం సరికాదని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడం సరికాదని చాడ వెంకట్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని తెలుస్తోంది.దేశంలో 28 రాష్ట్రాలు బీజేపీని గద్దె దించాలని చూస్తున్నాయన్న చాడ పొత్తులో భాగంగా కేసీఆర్ కు ఏం చెప్పామో కాంగ్రెస్ పార్టీకి కూడా అదే చెప్పామని వెల్లడించారు.
అయితే పొత్తులో భాగంగా తాము ఐదు సీట్లు అడిగామన్నారు.లేదంటే 33 నియోజకవర్గాల్లో సీపీఐ అభ్యర్థులను నిలబెడతామని ఆయన స్పష్టం చేశారు.







