ప్రకాశం జిల్లా గిద్దలూరు పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది.నల్లమల్ల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వానలతో గిద్దలూరు సమీపంలోని సగలేరు వాగు ఉగ్రరూపం దాల్చింది.
ఈ క్రమంలోనే సగలేరు వాగును ఇద్దరు వ్యక్తులు బైకుపై దాటేందుకు ప్రయత్నించారు.అయితే వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో యువకులు గల్లంతయ్యారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు.వాగులో గల్లంతై ముళ్ల పొదల్లో చిక్కుకున్న ఇద్దరు యువకులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.







