ఏపీలోని 26 జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు నిర్మితం కానున్నాయి.ఈ మేరకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ఇందులో భాగంగా జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించాలని జగన్ నిర్ణయించారని ఆ పార్టీ నేత, మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి తెలిపారు.ఈ క్రమంలోనే విశాఖ జిల్లాలో మొదటి కార్యాలయాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఆరు, ఏడు నెలల్లో ఎన్నికలు రానున్నాయని తెలిపారు.అయితే ఎన్నికలు ముందు వచ్చినా తమకు అభ్యంతరం లేదన్న మంత్రి అమర్నాథ్ జమిలి ఎన్నికలపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.







