తన “యువగళం “ పాదయాత్రతో రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తున్న తెలుగుదేశం జాతీయ కార్యదర్శి లోకేష్ ( Lokesh Nara )ఇప్పటికే మూడొంతుల పాదయాత్రను పూర్తి చేసుకున్నారు.అయితే గత కొంత కాలం క్రితం వరకూ కేవలం ప్రభుత్వపై విధాన పరమైన విమర్శలతో సరిపెట్టిన లోకేష్ ఇప్పుడు మరింత డోస్ పెంచారు.
కన్నుకు కన్ను పన్నుకు పన్నుకు సిద్దాంతాన్ని అమలు చేస్తామని మాట్లాడుతున్నారు మీరు ఒక రాయి వేస్తే మేము నాలుగు రాళ్లు వేస్తామన్నట్లుగా కార్యకర్తలను రెచ్చ కొడుతున్నారని, ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే రాజకీయంగా అంత పెద్ద పెదవులు ఇస్తామంటూ కార్యకర్తలను అవాంఛనీయ సంఘటన ల వైపు పరిగొలపుతున్నారని ఆయనపై వైసిపి నేతలు( YCP party ) ఎక్కడికక్కడ కేసులు పెడుతున్నారు .

అంతేకాకుండా ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా కార్యకర్తలకు, ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉండాల్సిన వ్యక్తి ఇట్లా ప్రభుత్వంపై కానీ , చట్టాలపై కనీస మర్యాద లేకుండా మాట్లాడుతున్నారని అమాయకులైన కార్యకర్తలను రెచ్చగొట్టి పోలీసులపై ఉసిగొల్పుతున్నారని తద్వారా అమాయకులైన కార్యకర్తలు పోలీసు కేసుల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారంటూ లోకేష్ ను బుక్ చేసేందుకు వైసిపి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది.

రాష్ట్రవ్యాప్తంగా లోకేష్ ( Lokesh Nara )చర్యలపై శాంతి బద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు అన్న కారణంతో కేసులు బుక్ అవుతున్నట్లుగా తెలుస్తుంది ఇంతకాలం లోకేష్ పాదయాత్ర ను చూసీ చూడనట్టుగా వ్యవహరించిన అధికార పార్టీ ఇప్పుడు ఆయనను చట్టప్రకారం బుక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇప్పటికే పుంగనూరు వంటి సంఘటన ల తో పోలీస్ శాఖ కూడా లోకేష్ వ్యవహార శైలి పై గురుగా ఉన్నందున ఇకపై లోకేష్ పర్యటనకు ఇబ్బందులు తప్పేటట్లుగా లేదు.పూర్తిస్థాయి ఆంక్షలు నడుమ లోకేష్ ఇకపై ముందుకు వెళ్లాల్సిన పరిస్థితిలు వచ్చేటట్టు కనిపిస్తున్నాయి.అయితే న్యాయస్థానాలను ఆశ్రయించైనా సరే పాదయాత్ర సజావుగా జరిగేలా చూడాలని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది
.






