ప్రతిపక్ష పార్టీ టీడీపీపై మంత్రి ఆదిమూలపు సురేశ్ తీవ్రంగా మండిపడ్డారు.డీబీటీలో అవినీతి అంటూ దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించారు.
నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి వెళ్తుంటే అవినీతి ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు.
ఎక్కడా అక్రమంగా ఓట్ల తొలగింపు జరగలేదని మంత్రి ఆదిమూలపు స్పష్టం చేశారు.
నారా లోకేశ్ హింసను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.అదేవిధంగా ఇటీవల యర్రగొండపాలెంలో చంద్రబాబు కాన్వాయ్ పై జరిగిన రాళ్ల ఘటనపై విచారణకు సిద్ధమని తెలిపారు.
ఈ ఘటనకు వైసీపీ వారే పాల్పడ్డారని తేలితే రాజకీయ సన్యాసం చేస్తానని మంత్రి ఆదిమూలపు సవాల్ చేశారు.







