టీడీపీ అధినేత చంద్రబాబుతో మాజీ వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు మరికాసేపటిలో భేటీ కానున్నారు.చంద్రబాబుతో సమావేశం అనంతరం ఆయన పసుపు జెండాను కప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు ఇవాళ రాత్రికి కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజవకర్గంలోకి ప్రవేశించనున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో రేపటి నుంచి లోకేశ్ పాదయాత్రలో యార్లగడ్డ పాల్గొననున్నారని సమాచారం.
అదేవిధంగా ఎల్లుండి భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు యార్లగడ్డ.గత కొన్ని రోజులుగా వైసీపీపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న యార్లగడ్డ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.
చంద్రబాబు అవకాశం ఇస్తే గన్నవరం నియోజకవర్గం నుంచి ఆయన బరిలో దిగనున్నారని సమాచారం.







