హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది.విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించిన కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి వద్ద అక్రమంగా తరలిస్తున్న అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సదరు ప్రయాణికుడు బంగారాన్ని బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.బంగారం తరలిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారిస్తున్నారు.అదేవిధంగా పట్టుబడిన బంగారం విలువ రూ.30 లక్షలు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.







