మూవీ మొగల్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సాధించిన రామానాయుడు ( Ramanaidu ) వారసులుగా ఇండస్ట్రీలో ప్రస్తుతం వెంకటేశ్, సురేష్ బాబు,రానా, అభిరామ్ కొనసాగుతున్నారు.ఇక వీరందరిలో సురేష్ బాబు స్టార్ ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ లో రాణిస్తూ ఉంటే వెంకటేష్ స్టార్ హీరోగా సినిమాల్లో కొనసాగుతున్నారు.
ఇక రానా దగ్గుబాటి ( Rana Daggubati ) హీరోగా విలన్ గా.హీరో గా.విభిన్న పాత్రలను పోషిస్తూ ముందుకు వెళ్తున్నారు .అయితే కేవలం దగ్గుబాటి అభిరామ్ విషయంలో మాత్రమే సినిమాల్లోకి రాకముందే ఎక్కువ పాపులర్ అయ్యారు.అదీ ముఖ్యంగా శ్రీ రెడ్డి అనే నటి విషయంలో.దగ్గుబాటి అభిరామ్ ఎప్పుడో సినిమాల్లోకి రావాల్సి ఉండగా.ఆయన విషయంలో జరిగిన ఒక కాంట్రవర్సీ వల్ల ఎన్నో రోజులు సినిమాలకు దూరంగా ఉన్నారు. సినిమాల్లో హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన శ్రీరెడ్డి ( Srireddy ) ని దగ్గుబాటి అభిరామ్ అవకాశాలు ఇస్తానని వాడుకొని అన్ని కోరికలు తీర్చుకున్నాక ఎలాంటి అవకాశం ఇవ్వలేదని తమకు సంబంధించిన ప్రైవేట్ ఫోటోలను బయట పెట్టింది శ్రీరెడ్డి.
దీంతో ఇండస్ట్రీలో పెద్ద దుమారం జరిగింది.ఇక అప్పటినుండి అభిరామ్ మీడియాకి,ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉండేవారు.కానీ ఈ మధ్యకాలంలో అహింస ( Ahimsa ) అనే ఫిలిమ్ తో మొదటిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఈ సినిమాని తెలుగు ప్రజలు అంతగా ఆదరించలేకపోయారు.
కథ సరిగ్గా లేకపోవడంతో ఈ సినిమా భారీ ప్లాఫ్ అయ్యింది.అయితే రెండో సినిమా మంచి స్టోరీ ఎంచుకొని హిట్ కొట్టాలి అని చూస్తున్న నేపథ్యంలో దగ్గుబాటి అభిరామ్ ( Daggubati Abhiram ) కి పెళ్లి చేయాలి అని ఇంట్లో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారట.ఇక ఆ నిర్ణయానికి అభిరామ్ కూడా ఓకే చెప్పారట.పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరు అని మీరందరూ భావిస్తున్నారు కావచ్చు.అయితే అభిరామ్ పెళ్లి చేసుకోబోయేది బయటికి వ్యక్తులను కాదు.ఆయన సొంత మరదలినే అని తెలుస్తుంది.
స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు తమ్ముడి మనవరాలిని అంటే అభిరామ్ కి స్వయానా మరదలు అవుతుంది.ఆ అమ్మాయిని అభిరామ్ కి పెళ్లి చేయాలి అని దగ్గుబాటి ఫ్యామిలీ నిర్ణయం తీసుకుందట.
ఈ నిర్ణయానికి అభిరామ్ కూడా ఓకే చెప్పడట.మరికొద్ది రోజుల్లోనే దగ్గుబాటి ఇంట్లో పెళ్లి భాజాలు మోగబోతున్నాయి అంటూ ఇండస్ట్రీ నుండి వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే దగ్గుబాటి అభిరామ్ పెళ్లి జరిగితే శ్రీ రెడ్డి ( Srireddy ) రియాక్షన్ ఏంటో అని ఈ విషయం తెలిసి కొంత మంది నెటిజన్స్ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.ఏది ఏమైనప్పటికీ దగ్గుబాటి అభిరామ్ పెళ్లి జరిగినప్పుడు కచ్చితంగా శ్రీ రెడ్డి ఏదో ఒక విషయంలో ఆయన్ని టార్గెట్ చేస్తుంది.ఇది మాత్రం పక్కా అంటూ ఈ విషయం తెలిసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.