వైసీపీకి భయపడే ప్రసక్తే లేదని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు.నారా లోకేశ్ పాదయాత్ర చూసి వైసీపీకి భయం పట్టుకుందని విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని ప్రశాంత్ కిషోర్ సర్వే రిపోర్ట్ ఇచ్చారని బోండా ఉమ తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు ఉండవని మంత్రి బొత్స అంటున్నారని చెప్పారు.
రెండు పార్టీలు ఉండవంటే హత్యకు ఏమైనా ప్లాన్ చేశారా అని ప్రశ్నించారు.వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లిలో బొత్సను ఓడిస్తామని తెలిపారు.
బొత్స ఫ్యామిలీతో సహా 50 మంది ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్ లో ఉన్నారన్నారు.వైసీపీ ప్రభుత్వానికి ధైర్యముంటే తక్షణమే ఎన్నికలు పెట్టాలని సవాల్ చేశారు.
వైసీపీకి 175కి 175 వస్తే తమ పార్టీనే మూసేస్తామని స్పష్టం చేశారు.ఈ క్రమంలోనే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారంలోకి వచ్చేది టీడీపీనేనని ధీమా వ్యక్తం చేశారు.







