నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ ఘటనల నేపథ్యంలో అధికారులు చర్యలకు సిద్ధం అయ్యారు.ఈ మేరకు పీయూసీ-1 విద్యార్థులకు ఇంచార్జ్ వీసీ సెలవు ప్రకటించారు.
అయితే విద్యార్థులు పది రోజుల క్రితమే క్యాంపస్ లో చేరగా.ఐదు రోజుల పాటు హోమ్ సిక్ హాలిడేస్ ను ప్రకటించారు.
కాగా గత కొన్ని రోజులుగా ఇద్దరి విద్యార్థినీలు ఆత్మహత్యకు పాల్పడగా తాజాగా జాదవ్ బబ్లు అనే విద్యార్థిని బలవన్మరణం చెందిన విషయం తెలిసిందే.కాగా జాదవ్ బబ్లు బలవన్మరణానికి పాల్పడడానికి హోమ్ సిక్ కారణమని ట్రిపుల్ ఐటీ సిబ్బంది భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులతో ఐటీ సిబ్బంది సమావేశం అయ్యారు.